Wednesday, February 26, 2025
Homeతెలంగాణఎన్ ఎస్ యు ఐ బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు జోరుగా నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచారం

ఎన్ ఎస్ యు ఐ బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు జోరుగా నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచారం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 :బోధన్ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో వివిధ గ్రామంలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రచారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాయకులు ఓటర్ల దగ్గరికి వెళ్లడం జరిగింది అనంతరం వివిధ నాయకులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ని గెలిపించుకుందాం అనంతరంవిద్యార్థి విభాగం NSUI బోధన్ నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది,ఆ బాధ్యత గుర్తేరిగి ఉద్యోగాలు ప్రథమ ప్రాధాన్యతగా నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 55 వేల పైచిలుకు ఉద్యోగుల భర్తీతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు ఏడాది పరిపాలనా కాల సమయంలో, వాటికి తోడు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 24వేల మంది టీచర్ల బదిలీలు, 21వేల మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు మరి ముఖ్యంగా 2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగ కల్పన వంటి ఎన్నో కార్యక్రమాలను ఈ ప్రభుత్వం తీసుకుంది, నిరుద్యోగులు, ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలపరిచిన కరీంనగర్, అదిలాబాద్, నిజాంమాబాద్ ,మెదక్, ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓట్లు వేసి గెలిపించుకోవాలని పట్టభద్రులకు ,ఉద్యోగులకు, టీచర్స్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అనిల్ కుమార్ వీరేశ్ శివరాజ్ శేఖర్ వివిధ హోదాల్లో ఉన్నా నాయకులు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments