Friday, May 9, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏ ఎన్ కె డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి

ఏ ఎన్ కె డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి

Listen to this article

కళాశాల ప్రిన్సిపాల్ కె. లక్ష్మినారాయణ

పయనించే సూర్యుడు ఫిబ్రవరి12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు ఏ ఎన్ కె డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో వున్న నిరుద్యోగ యువతీ యువకులు కొరకు ఏ ఎన్ కె డిగ్రీ కళాశాల ,కసి రెడ్డి పల్లి, కదిరి రోడ్ శ్రీ సత్య సాయి జిల్లాయందు13-02-2025 వ తేదీన జాబ్ మేళా నునిర్వహిండంజరుగుతుంది13-02-2025 వ తేదీన 6 కంపెనీల కొరకు ఉద్యోగమేళానిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి 10 తరగతి ఇంటర్ మరియు డిప్లమా, డిగ్రీ,పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉన్న వారు అర్హులు అని తెలియజేశారు. వీరికి నెలకు 12,000-20,000 రూపాయలు వరకు జీతం ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు శ్రీ సత్య సాయి జిల్లా, బెంగళూరు లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇంటర్వ్యూ కి హాజరయ్యే అభ్యర్థులు తమ బయో డేటా తో పాటు , ఆధార్ కార్డ్, విద్యార్హత పత్రాలు తీసుకొని ఉదయం తొమ్మిది గంటలకి హాజరు కాగలరని తెలిపారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగ మేళా కి హాజరై ఉపాధి పొందగలరని కళాశాల ప్రిన్సిపల్ కె. లక్ష్మి నారాయణ మరియు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్యా అధికారి బి. హరి కృష్ణ తెలియజేసారు.ఇంటర్వ్యూ కి హాజరయ్యే వారు ఈ క్రింది లింక్ లో రిజిస్టర్ చేసుకో గలరు https://naipunyam.ap.gov.in/user-registration ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించగలరు 7702002059 .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments