Tuesday, March 18, 2025
Homeతెలంగాణకోలాం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మేలే వెడ్మ బొజ్జు పటేల్

కోలాం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మేలే వెడ్మ బొజ్జు పటేల్

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 17 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా… ఉట్నూర్ మండలంలోని జెండాగూడా మొర్రిపేట్శి వగూడా గ్రామాలలోని కోలాం నాయక్ పోడు గిరిజనులకు ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ ప్రాంతంలోని నిరుపేదలకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో పెరుగుతున్న చలిని దృష్టిలో ఉంచుకొని నిరుపేద కోలాం,నాయకపోడు గిరిజనులకు తమవంతుగా దుప్పట్లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ బానోత్ జైవంతరావు ఆర్టీఎ జిల్లా సభ్యులు దూట రాజేశ్వర్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య ఉట్నూర్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్ సర్పంచ్లు భీమన్న జగదీష్ కాంగ్రెస్ నాయకులు దాసండ్ల ప్రభాకర్ రాజేష్ మహేందర్ గ్రామ పటేల్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments