Thursday, July 17, 2025
Homeఆంధ్రప్రదేశ్గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు

గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ నిజాంబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాలల మోహన్ రెడ్డి

వాస్తవాలు ప్రశాంత్ రెడ్డికి తెలిసేవిధంగా కనువిప్పు కార్యక్రమం తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పై అబద్ధపు మాటలు మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్న ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయడానికి రేపు 17-07-2025 గురువారం రోజున ఉదయం 10:00 గంటలకు ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల పట్ల అండగా నిలబడకుండా గల్ఫ్ బాధితుల బాధను చుసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ ఎన్ యు ఏర్పాటు చేసి ఏదైనా కారణాల వల్ల గల్ఫ్ లో మరణించిన కుటుంబాలను ఆదుకుంటుంటే ఇవేవి తెలియనట్టు కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనే దురచలనతే ప్రశాంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు.ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలపై చర్చించడానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను మానాల మోహన్ రెడ్డి,బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి,రాష్ట్ర విత్తనబివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రేపు వేల్పూరు గ్రామానికి వస్తున్నాం.కావున ప్రశాంత్ రెడ్డి నీకు ఏమైనా నీతి ఉంటే రేపు వేల్పూరు కి రా గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలుస్తుందో చూపిస్తాము.కావున జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున్న వచ్చి ప్రశాంత్ చెప్తున్న మాటలలో వాస్తవం ఎంతో ఉంది గ్రహించగలరని,అదేవిధంగా తెరాస నాయకులు వచ్చి మీ నాయకుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తెలుసుకుని మీరైనా ఆయనకు బుద్ధి వచ్చేలా చెప్పాలని పిలుపునిస్తున్నాము.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments