
పయనించే సూర్యడు జనవరి 18 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
నడిగూడెం మండల చాకిరాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గడ్డమీది రామచంద్రయ్య చిత్తలూరి నరసింహ రావు పొడిచెట్టు గోవిందులు మొగలకాని నాగేశ్వరావు గడ్డమీద సతీష్ మొగలిగాని వెంకన్న మల్లయ్య మొదలగువారు పాల్గొన్నారు