Tuesday, October 28, 2025
Homeఆంధ్రప్రదేశ్బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి

Listen to this article

బీఎస్పీ దుబ్బాక నియోజవర్గం అధ్యక్షులు సుద్దాల రాజు”

(పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్)

ఈరోజు దుబ్బాక నియోజకవర్గం పరిధిలో బిఎస్పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. నవంబరు 1 న హైదరాబాదులో పార్కు వద్ద జరిగే బీసీలకు 42% రిజర్వేషన్లపై జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు . జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే ప్రక్రియ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విఫలమయ్యాయి. అని వారు పేర్కొన్నారు. బీసీలు అందరూ ఏకమై కేంద్రాల రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజాధికారం సామాజిక న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దుబ్బాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు బండ నర్సింలు. దుబ్బాక ఇన్చార్జిలు. మ్యాదరి నర్సింలు. మోతే నర్సింలు. రుద్రారం ప్రశాంత్. బాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments