Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్మక్తల్ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు ఐదు నెలల బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలి...

మక్తల్ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు ఐదు నెలల బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలి CITU డిమాండ్

Listen to this article

డాక్టర్ శిల్పా కు వినతి పత్రం అందజేశారు

సి ఆర్ గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 : మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు ఐదు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని సంబంధిత డాక్టర్ శిల్ప గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చాలీచాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులకు డ్రెస్ కోడ్ బ్లౌజులు ఇవ్వాలని గోవింద్ రాజ్ డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు ఇవ్వని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన లు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధు, భీమ్, బాలరాజ్, పవన్, నరేష్, మహబూబ్, జమ్ములమ్మ,సంధ్య, లక్ష్మి, నర్మద, జమ్మలమ్మ, తిప్పమ్మ, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments