
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 03. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఫిబ్రవరి 7 హైదరాబాదులో జరుగు లక్షలాది డప్పుల వేలాది గొంతుల మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన గోడ పత్రికలను ఆవిష్కరించినఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులుయంగళ నరేష్ మాదిగ
అనంతరం వారు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తక్షణ అమలు కొరకు ప్రధాన డిమాండ్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా లక్షలాది డప్పుల వేలాది గొంతుల గొప్ప ప్రదర్శనకు ఏన్కూర్ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగ బిడ్డ, ఎస్సీ ఉప కులాల బిడ్డలు, సామాజిక న్యాయానికి మద్దతునిచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక సంఘాలు భారీ వాహనాలు ఏర్పాటు చేసుకొని డప్పు దళాలతో హైదరాబాదుకు కదం తొక్కాలని పిలుపునిచ్చారుఈ పోస్టర్ ఆవిష్కరణ
కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు పూర్ణాకంటి మైసరావు మాదిగ,మాజీ మండల అధ్యక్షులు పూర్ణాకంటి నాగరాజు మాదిగ,బీసీ నాయకులు చింతానబోయిన సీతారాములు, అంజనకుమార్ యాదవ్,జూపాటి శ్రీనివాస్, సాయిమాదిగ,ప్రవీణ్మాదిగ , రాకేష్ మాదిగ,నాగమణిమాదిగ, తిరుమల రావు మాదిగ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.