
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3,అశ్వాపురం ప్రతినిధి :సోమవారం నాడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తల్లిదండ్రులు చిన్నారులు భక్తిశ్రద్ధలతో అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా ఎక్స్లెంట్ ప్రిన్సిపాల్ లెనిన్ మాట్లాడుతూ జ్ఞానం వాక్కు విద్య మొదలైన శక్తులే సరస్వతి మాత అన్నారు . ఈ సందర్భంగా పిల్లలకు పలకలు పుస్తకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.