Monday, March 10, 2025
HomeUncategorizedశ్రీశ్రీ ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయం మహా కుంభాభిషేకం

శ్రీశ్రీ ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయం మహా కుంభాభిషేకం

Listen to this article

పయనించే సూర్యుడు కౌతాళం రిపోర్టర్ వంశీ

కౌతాలం మండలం ఉరుకుంద లో వెలిసిన
పవిత్రమైన శ్రీ శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరగింది. ఈ వేడుకలో మంత్రాలయం ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటిస్తూ,భక్తులందరికీ ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.ఈ మహోత్సవం భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం నిరంతరం ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి వారి సతీమణి యశోద , రఘునాథ్ రెడ్డి వారి సతీమణి చంద్రిక , రామకృష్ణ రెడ్డి వారి సతీమణి భారతమ్మ , రాకేష్ రెడ్డి , చూడి ఉలిగయ్య తనయులు నరేష్ గారు,LLC చైర్మన్ టిప్పుసుల్తాన్ ,అడివప్ప గౌడ్ ,వెంకటపతి రాజు , చిన్న గారు,dr. రాజానందన్ , చిరంజీవి, మహాదేవ నాయుడు, గట్టూరి ఈరన్న మరియు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments