Sunday, August 3, 2025
Homeఆంధ్రప్రదేశ్శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం పరిశీలించిన అధికారులు

శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం పరిశీలించిన అధికారులు

Listen to this article

పయనించే సూర్యుడు ఆగస్టు 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామంలో పెన్నా తీరం వెంబడి వెలసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానము అభివృద్ధికి సంబంధించి అధికార యంత్రాంగం గురువారం పరిశీలించడం జరిగింది కొన్ని రోజుల క్రితం ఆలయాన్ని స్వయంగా సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , ఆలయ చరిత్రకు తగిన అభివృద్ధి చేపడతామని భరోసా ఇచ్చారు.ఈ క్రమంలో ఆలయ పునఃనిర్మాణానికి అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై నివేదిక సమర్పించాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఇవాళ దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించి స్థల పరిస్థితులు, నిర్మాణ అవసరాలు, పురాతన శిల్పకళా ప్రాముఖ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన వారిలో పి. పరమేశ్వరప్ప, రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి, చి. శ్రీనివాసులు, గుంటూరు డి ఈ ఈ .ఏ. మురళీమోహన్, నెల్లూరు జిల్లా ఏ ఈ ఈ .పి. సురేంద్ర, సహాయక స్థపతి ఇతర సాంకేతిక సిబ్బంది పరిశీలించారు.ప్రతినిధి బృందం ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివిధ కోణాలను అధ్యయనం చేసి, తగిన ప్రతిపాదనలతో నివేదికను సిద్ధం చేయనున్నారు. భవిష్యత్తులో ఈ దేవస్థానాన్ని ప్రసిద్ధ పవిత్ర క్షేత్రంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వ యత్నాలు కొనసాగుతున్నాయి. గురువారం స్థానిక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తలపనేని జయంతి నాయుడు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments