Saturday, May 3, 2025
HomeUncategorizedఆదోని డీఎస్పీని మర్యాదపూర్వకరం కలిసిన బిజెపి నాయకులు

ఆదోని డీఎస్పీని మర్యాదపూర్వకరం కలిసిన బిజెపి నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు, జనవరి 31, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్:- ఆదోని నూతన డిఎస్పి హేమలత ని ఆదోని బిజెపి నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా వారి కార్యాలయానికి వెళ్లి కలిసినారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఆదోనికి మహిళా పోలీస్ అధికారి రావడం సంతోషించాల్సిన విషయం అని అన్నారు, సమాజ సేవ, రోడ్డు భద్రత, శాంతి భద్రతలు, చైల్డ్ లేబర్ అంశాలపై చర్చించినామని తెలిపారు, అనంతరం చత్రపతి శివాజీ విగ్రహాన్ని జ్ఞాపికగా అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కర్నూలు జిల్లా కార్యదర్శి రమాకాంత్, బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి శ్రీనివాస ఆచారి, వాల్మీకి సాయి ప్రసాద్, ఎన్డీఏ కూటమి సోషల్ మీడియా వర్కర్ రవి, బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, అంజయ్ కుమార్, ఉలిద్ర మోహన్, శ్రీకాంత్, మైనారిటీ నాయకులు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments