
—– బాలల హక్కుల సదస్సు లో హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం.
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12( వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం )కొణిజర్ల మండలం,పల్లిపాడు కార్తీక్ విద్యాలయం లో బహుజన అభ్యుదయ సేవా సమితి,మండల అధ్యక్షులు కొమ్ము భద్రయ్య అధ్యక్షతన జరిగిన బాలల హక్కుల అవగాహన సదస్సు లో విద్యార్థినీ,విద్యార్థులకు మానవ హక్కులు- చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలని అన్నారు.మా పనులు మేము చేసుకుంటూ కొంత సమయాన్ని మానవ హక్కులను ప్రచారం చేయడానికి స్వచ్చందంగా పనిచేస్తూ , ఆశా కార్యకర్తలకు డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అంగన్వాడీ లకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆదూరి మణి, బాల్య వివాహాలు, బాలల హక్కులు, డ్రగ్స్, మైనర్ డ్రైవింగ్ పలు చట్టాలను వివరించారు. అనంతరం విద్యాలయం నిర్వాహకులు బహుజన అభ్యుదయ సేవా సమితి, హ్యూమన్ రైట్స్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలను అభినందించి,కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.