
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు : టేకులపల్లి మండలం దంతల్ తండ గ్రామంలోసద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల మహా భోగ్ భండారో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని సేవలాల్ జయంతి సందర్భంగా వారు మాట్లాడుతూ అంధకారంలో ఉన్నప్పుడు ఆ జాతిని సరైన మార్గంలో నడిపించుటకు కొందరు దైవాంశ సంభూతులు ఈ భూమి మీద జన్మిస్తారు వారి బోధన ద్వారా మహిమలు దేవత అనుగ్రహంతో మహిమల ద్వారా ఆ జాతి పురోగమిస్తుంది దేవత అనుగ్రహంతో జన్మించిన వారు కారణజన్ము వారి జన్మకు సార్ధకట ప్రయోజనం ఉంటుంది ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క మహిమాన్వితులు జన్మించిన జాతికి వారు దైవాంశ సంభూతులుగా ఆరాధించబడతారు. అలాంటి కోవాకు చెందిన సేవాలాల్ మహారాజు బంజారా ఆరాధ్యదైవంగా దుర్బర స్థితిని తొలగించి ఆర్థిక సాంఘిక రాజకీయ సంస్కరణ ద్వారా నడిపించేటప్పుడు సేవాలాల్ మహారాజ్ భూమి మీద ఉద్భవించిన భగవత్ అవతారాలు ఆరాధ్యులు గురుదేవులు ఆరాధ్యుడు గురుదేవుడు అని అన్నారు దైవంగా పిలవబడి అస్తవ్యస్తంగా బ్రతుకుతున్న ప్రజలకు సక్రమమైన మార్గంలో బోధన చేసి హైందవ సామ్రాజ్యం గురించి సామాజిక సాంస్కృతికగా పరమైన అనేక విషయాలు మనకు తెలియపరచి గ్రామీణమైన మనుషులకి నగరవాసులను అడవి మృగంలో నుండి పోకిరి దొంగల నుండి ఇతర అసాంఘిక శక్తుల నుండి రక్షిస్తూ శాంతియుతంగా ప్రశాంత జీవనమును సాగిస్తూ వారి వారి నిత్యావృత్యములకు ఏ విధమైన ఆటంకములు రాకుండా వారిని కాపాడుకుంటూ నా ధర్మం అని చెప్పి చూపించిన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని అన్నారు బంజారాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, కోరం సురేందర్, మండల అధ్యక్షులు దేవా నాయక్ , నాయకులు ఈది గణేష్, రెడ్యా నాయక్, పోషాలు,శివ, ఉదయ్,భూక్యా నాగేశ్వరావు , శంకర్, బొడా రమేష్,పకిరా, భూక్యా రమేష్, భూక్య రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.