Wednesday, March 19, 2025
Homeతెలంగాణడెంగ్యూ బాధితుడికి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేసిన అంకం బాలకిషన్.

డెంగ్యూ బాధితుడికి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేసిన అంకం బాలకిషన్.

Listen to this article

17/01/2025* పయనించే సూర్యుడు జబ్బర్ నాయక్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి….కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రాజేష్ కు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్లేట్ లెట్స్ ను కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం అత్యవసర పరిస్థితులు ఉన్న వారికి కావలసిన ప్లేట్ లెట్స్ ను అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్న రక్తదాత బాలకిషన్ ఐవి ఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని తోటి వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడానికి రక్తదాతలు ముందుకు రావాలన్నారు సకాలంలో రక్తాన్ని అందజేయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు జమీల్,నిర్వాహకులు జీవన్,వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments