Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆరు గ్యారంటీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు

ఆరు గ్యారంటీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు

Listen to this article

జనం న్యూస్ -జనవరి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు గడుస్తున్న ఎన్నికల హామీలు అయినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని, తక్షణమే ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలియజేశారు, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి ,చంద్రమౌళి నాయక్, శేఖర్ చారి ,మన్సూర్, పిట్ట సైదులు, చంద్రయ్య, షరీఫ్ బాబా, నజీర్, కందగట్ల వీరయ్య, కోట్ల సైదులు, సాగర్, లక్ష్మణ్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments