
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 16 మామిడిపెల్లి లక్ష్మణ్… రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున సాయిబాబా మందిర ఆవరణలో ముగ్గుల పోటీలు మరియు గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులంతా అందమైన ముగ్గులు వేస్తూ పోటా పోటీగా నిలిచారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి దాతలుగా నిలిచిన చందనగిరి మనోహర్,సత్య హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ కుమార్, కాటిపల్లి గంగారెడ్డి వారి మనుమరాల్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ సేవా సమితి అధ్యక్షులు నల్ల గంగారెడ్డి మాట్లాడుతూ… మొట్టమొదటి నుండి గ్రామం ఐకమత్యంగా ఉంటుందని, ప్రతి పండుగను కలిసి మెలిసి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు,తాజా మాజీ ఎంపీటీసీ కొమ్ముల రాధ ఆదిరెడ్డి,మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు నారాయణ గౌడ్, కొల్లూరు వేణు,నీరటి శ్రీనివాస్, అనుపురం చిన్న లింబాద్రి, కనపర్తి శ్రీనివాస్,సామల్ల నవీన్, మెడపట్ల మహేష్, నరేష్, విప్పర్ గంగాధర్, మంత్రి అరవింద్ గౌడ్,గ్రామ సేవా సమితి సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు