Friday, May 2, 2025
HomeUncategorizedఐడిఎ ఆధ్ర్యర్యంలోజాతీయ మహిళా వైద్యుల దినోత్సవం..

ఐడిఎ ఆధ్ర్యర్యంలోజాతీయ మహిళా వైద్యుల దినోత్సవం..

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి):- కాకినాడ సాధారణ ప్రభుత్వ ఆసుపత్రిలోలో కాకినాడ ఐడిఎ సభ్యుల ఆధ్వర్యాన జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సంధర్భంగా డా శైలజ గారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ” జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సంధర్భంగా ఆరోగ్య సంరక్షణలో మహిళా వైద్యులు చేసిన అమూల్యమైన సేవలను గుర్తించడానికి ఈ రోజు అంకితం చేయబడింది అని అన్నారు. వైద్యపరమైన పురోగతి, రోగుల సంరక్షణ మరియు ప్రజారోగ్య మెరుగుదలకు అవిశ్రాంతంగా దోహదపడుతున్నదేశవ్యాప్తంగా ఉన్న మహిళా వైద్యులను స్మరించుకోవడానికి మరియు అభినందించడానికి ఇది మంచి రోజని అన్నారు .
డా యేరూష మాట్లాడుతూ”
ఈ రోజు వైద్య వృత్తిలో మహిళలు పురుషుల కు ధీటు గా తమ వైద్య సేవలను సమర్దవంతంగా నిర్వహించటం గర్వించదగ్గ విషయం అని అన్నారు .
డా శైలజ మాట్లాడుతూ”
ప్రారంభ జాతీయ మహిళా వైద్యుల దినోత్సవాన్ని ఫిబ్రవరి 3, 2016న జరుపుకున్నారు అని,1849లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్య పట్టా పొందిన మొదటి మహిళ అయిన డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్‌వెల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పవిత్రమైన తేదీని ఎంచుకున్నారని తెలిపారు
వైద్య వృత్తిలో ఉన్న మహిళలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో భవిష్యత్ మహిళలకు మార్గం సుగమం చేయాలని,.సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం వహించే రంగాలలో లింగ అడ్డంకులను అధిగమించడం నుండి, ఆరోగ్య సంరక్షణలో మార్గదర్శక పరిశోధన మరియు అభివృద్ధి వరకు, మహిళావైద్యులుముఖ్యమైనపాత్ర పోషిస్తున్నారు, ఎక్కువ మంది మహిళలను మెడిసిన్ తీసుకోవడానికిప్రోత్సహించడానికి మరియు సమాజంలో సానుకూల మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక గొప్ప రోజు అని అన్నారు. ఈ కార్యక్రమం లో డా శ్రీవల్లి డా సిరాజ్ డా నాగేంద్ర డా. చైతన్య భాను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments