▪ దళిత బందు నిధులు రాకుండా ఆపింది కౌశిక్ రెడ్డి.
▪త్వరలోనే జర్నలిస్టుల సమస్య పరిష్కారానికికృషి చేస్తా.
▪ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడు.
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 01హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, దళిత బంధు నిధులు విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్ వోడితల ప్రణవ్ అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. దళితుల భాగోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు దళిత బంధు నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకే నిధులు వచ్చేలాచర్యలు తీసుకుంటామని తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ కు దగ్గర అని చెప్పుకొని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కరించడంలో లేదని, ప్రభుత్వ పథకాల పై కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చి 31 వరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడని, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లు పెట్టడం కాదని ప్రజల వద్దకు వెళ్తే వారే కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధిచెప్తారని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణావ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం
RELATED ARTICLES