
దొంతికుంట చెరువు పరిసరాలను పరిశీలించిన రాష్ట్ర ఐడిసి చైర్మన్ మువ్వా ఎమ్మెల్యే జారె
పయనించే సూర్యుడు జనవరి 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండల రిపోర్టర్… అశ్వారావుపేట మండలంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు ఈ పర్యటనలో భాగంగా దొంతికుంట చెరువు పరిసరాలు పూర్తిగా పరిశీలించి త్వరలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు కేటాయించి అన్ని హంగులతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు అశ్వారావుపేట త్వరలో మున్సిపాలిటీ గా మారుతున్న తరుణంలో దొంతికుంట చెరువును అందంగా తీర్చిదిద్ది మండల ప్రజలకు కానుకగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు