పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1, కర్నూలు జిల్లా శ్రీకాంత్ఆదోని పౌర సరఫరాల గొదం పాయింటను శనివారం సాయత్రం ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్… గొదంలో ఉన్న రేషన్ నిల్వ, మరియు రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఉప తహశీల్దారు వలి భాష, ఉప తహశీల్దారు రవీంద్ర రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పౌర సరఫరాల గొడం పాయింట్ ను తనిఖీ చేసిన ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్:-
RELATED ARTICLES