Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే హక్కు లేదు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే హక్కు లేదు.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 29, శివంపేట మండల రిపోర్టర్ ఆంజనేయులు గౌడ్. మండల కేంద్రమైన శివంపేట లో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి మరియు శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి భయపడి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక 10 సంవత్సరాలలో వారు చేయలేని పనులను కేవలం 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఇలా అయితే తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని భయపడి వారి పార్టీ ఎమ్మెల్యే సునీత రెడ్డి మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను అయోమయానికి గురి చేస్తూ పొంతన లేని మాటలు మాట్లాడుతూ మా నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు
నిజాం ప్రభుత్వంలో రజాకారుల లాగా దాడులు చేస్తాం తిరగనివ్వం అని బెదిరిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని చేతులు ముడుచుకొని కూర్చోరని ఈ సందర్భంగా హెచ్చరించారు ఒకసారి ప్రజలు వద్దని చీకొట్టిన ఇంకా వారి తీరు మార్చుకోవడం లేదని ఎద్దేవా చేశారు ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై లేనిపోని చిల్లర మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం మీ అంతు చూస్తాం ఖబర్దార్ అని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో శివంపేట మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ రవి నాయక్ శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారాల గణేష్ బిజిలిపురం సత్తయ్య కమలయ్య గారి వెంకటేష్ డి కృష్ణ బలవంత రెడ్డి నాగభూషణం ప్రభు లింగం గౌడ్ మెతుకు మల్లేష్ ఈసారపు రాజు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సరిగారి నారాయణ లస్కర్ ఆంజనేయులు నారాయణ గారి యాదగిరి మహమ్మద్ షబ్బీర్ బొట్టు కృష్ణ మణికంఠ గౌడ్ సల్మాన్ నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments