
అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ పి. సాయన్న…
రుద్రూర్, మే 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో రైడ్స్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థినీలకు శుక్రవారం రుద్రూర్ ఎస్సై సాయన్న సైబర్ నేరాలు, మహిళల రక్షణ, రోడ్డు భద్రతా నియమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ బృందం సభ్యులు, విద్యార్థినిలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.