
పయనించే సూర్యుడు మే 16 అన్నమయ్య జిల్లా టి సుండు పల్లి మండలం
సుండుపల్లె : మండల కేంద్రానికి సమీపంలోని ఈడిగపల్లెలో వెలసిన ఆదిపరాశక్తి, కొత్తపురమ్మ తిరుణాల మహోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివారం ఉదయాన్నే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యుత్ దీపాలంకరణతో చాందిని బండ్లు ప్రదక్షిణలు చేస్తాయని వారు పేర్కొన్నారు. మండలంలోని ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను సేకరించి,తిరుణాల మహోత్సవాన్ని తిలకించవలసిందిగా వారు కోరారు.