Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీలో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి...

సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీలో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి బిజెపి

Listen to this article

సుండుపల్లి మండల అధ్యక్షులు ఎస్ వి రామన్ గౌడ్ మాట్లాడుతూ.

ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. 2018 డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని కింద సాగు చేసే భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. ఏడాదికి రూ. 6 వేలను ఈ స్కీమ్ కింద రైతులకు ఇస్తుంది. ఇక్కడ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ( డి బి టి ) ద్వారా జమవుతాయి. రూ. 6 వేలను ఒకేసారి అందించదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ విడతల వారీగా అందిస్తుంది. ప్రతి విడతకు రూ. 2 వేల చొప్పున ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతలుగా ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 18 విడతల డబ్బుల్ని విడుదల చేసింది. ఇప్పుడు 19వ విడత కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. 18వ విడతలో 10.32 కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ లో పనిచేస్తున్న మన్సూర్, కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments