నాదెండ్ల వారి కండ్రిగలో ఏపీ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమం
పయనించే సూర్యుడు డిసెంబర్ 31( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. సూళ్లూరుపేట మండల రెవెన్యూ అధికారి (MRO) ఆదేశాల మేరకు జనవరి 2వ తేదీ నుంచి గ్రామంలోని అన్ని భూములకు రీ సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. రీ సర్వే ప్రక్రియకు గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. సర్వే పూర్తైన అనంతరం క్లియర్ అయిన భూములకు పట్టా పాస్బుక్లు […]




