ఆశ్రమ పాఠశాలలో వైద్య శిభరం
పయనించె సూర్యుడు మార్చి 11(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :సులానగర్ పి హెచ్ సి డాక్టర్ కంచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కోయిగూడెం ఆశ్రమ పాఠశాల ని మరియు మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర హాస్టల్ ని సందర్శించి వైద్య శిబిరం నిర్వహించే అవసరమైన పిల్లలకు చికిత్సను అందించడం జరిగింది పరీక్షలు సమీపిస్తున్న దృశ్యా పరీక్షా సమయంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది వంటశాలను మరియు స్టోర్ రూమును సందర్శించి వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కూరగాయలను పరిశుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే వంటకు ఉపయోగించాలని వంటవారిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్ స్థానిక ఎంపీడీవో శ్రీమతి మల్లీశ్వరి ప్రిన్సిపల్ రవీందర్ రవీందర్ ఆరోగ్య విస్తరణ అధికారి దేవా తదితరులు పాల్గొన్నారు
