ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు భైంసా సబ్ డివిజన్ అధికారులతో సమావేశమైన జిల్లా ఎస్పీ
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
అధికారులకు మార్గదర్శకం చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్
రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ఈరోజు భైంసా సబ్ డివిజన్కు చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
