PS Telugu News
Epaper

ఏర్గట్ల మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

📅 30 Aug 2025 ⏱️ 6:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా

ఈరోజు శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండలం లోని తడపాకల్, గుమ్మిర్యాల్, దొంచంద గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గోదావరి నది వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం కల్పించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన వ్యవసాయ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమదేవరెడ్డి లింగారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top