PS Telugu News
Epaper

కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మున్సిపాల్ చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి

📅 28 Feb 2026 ⏱️ 9:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్

పురపాలక కార్యాలయం నందు ఈరోజు శనివారం రోజున కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు కార్యాలయం నందు చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి కౌన్సిలర్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో 28 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు ప్రజా పాలన ప్రభుత్వ వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లత నరయ్య. కమిషనర్ గోపు గంగాధర్. కౌన్సిలర్లు సందీప్. తోట సతీష్. అంజుమ్. సంగ్య నాయక్. పర్స కుశలత అనంతరావు. నీలం రవి. బోదిరే లావణ్య నరయ్య. మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

Scroll to Top