కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు..
రుద్రూర్, డిసెంబర్ 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారాం, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, పత్తి లక్ష్మణ్, తోట్ల చిన్న గంగారాం, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, ఏఎంసి డైరెక్టర్ పార్వతి ప్రవీణ్, కన్నె రవి, బాలరాజ్, ఎండి ఇమ్రాన్, అనిల్ పటేల్, రమేష్ షేక్ ఖాదర్, అడప శంకర్, కోడె శంకర్, ఎండి షామీర్, పత్తి సాయిలు, షేఖ్ షాదుల్, సిద్ధాపుర్ లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.