PS Telugu News
Epaper

కృష్ణ మండలంలో రాజకీయ శిక్షణ తరగతులు కరపత్రం విడుదల

📅 02 Sep 2025 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్ 2// నారాయణపేట జిల్లా బ్యూరో //బి విశ్వనాధ్.

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కృష్ణ మండలంలో ఆదివారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రాజకీయ శిక్షణ తరగతులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం విడుదల చేయడం ఈ కార్యక్రమాని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ మాట్లాడుతూ ఆదివారం జరగబోయే రాజకీయ శిక్షణ తరగతులకు కృష్ణ మండలం నుండి అనేకమంది నాయకులు మరియు బహుజన వాదం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఇంచార్జ్ పాలెం వెంకటయ్య మాట్లాడుతూ బహుజన వాదం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇంక లోతైన విశ్లేషణ చేయడానికి ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతావని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఇన్చార్జి పాలెం వెంకటయ్య మక్తల్ అసెంబ్లీ కోశాధికారి నేరటి మల్లికార్జున్ కృష్ణ మండల అధ్యక్షుడు చేగుంట మారెప్ప మక్తల్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మక్తల్ మండల అధ్యక్షులు భీమేష్ చేగుంట బసవరాజ్ వెంకటేష్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Scroll to Top