PS Telugu News
Epaper

కొత్తూరు సుబ్బరాయునికి 3.244 కేజీల వెండి వస్తువులు విరాళం”

📅 27 Oct 2025 ⏱️ 3:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article


పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

ప్రముఖ శైవక్షేత్రము లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవము పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 3 కేజీల 244 గ్రాముల వెండి వస్తువులు ఆదివారం వితరణ చేసినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన దేరెడ్డి నాగిరెడ్డి, దేరెడ్డి నాగ మునీశ్వర రెడ్డి వారి కుటుంబ సభ్యులకు స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా “వెండి బిందె, వెండి పళ్ళెము, వెండి చెంబు” మూడు వస్తువులు 3 కేజీల 244 గ్రాములు విరాళంగా కార్యనిర్వాహణాధికారికి సమర్పించారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. దాతలకు ఆలయ మర్యాదలతో అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, పాణ్యం ట్రైనింగ్ ఎస్సై ధనుంజయ, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, దాత కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top