గొల్లపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
పయనించే సూర్యుడు జనవరి 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన రీ–సర్వే ప్రాజెక్టు పట్టాదారు పాసుపుస్తకాలను, జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆత్మకూరు డివిజన్ వారి సూచనల మేరకు శుక్రవారం గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఈకార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య. తెలుగుదేశం పార్టీ నాయకులు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత . హజరతయ్య చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ ఆర్ మస్తానయ్య మాట్లాడుతూ రీ–సర్వే ద్వారా భూమి రికార్డులు పారదర్శకంగా మారతాయని, రైతులకు భూ హక్కుల పరంగా మరింత భరోసా లభిస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సురేష్. ఆర్ ఐ. సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు
