PS Telugu News
Epaper

తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మోర లక్ష్మీరాజ్యం ఘన విజయం

📅 15 Dec 2025 ⏱️ 2:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, డిసెంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్


రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మోర లక్ష్మీరాజ్యం ఘన విజయం సాధించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 1612 ఓట్లు సాధించి, ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయంతో తంగళ్ళపల్లి గ్రామం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించగా, ప్రజలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సర్పంచ్‌గా తనను గెలిపించిన గ్రామ ప్రజలకు మోర లక్ష్మీరాజ్యం కృతజ్ఞతలు తెలియజేస్తూ, తాను అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Scroll to Top