PS Telugu News
Epaper

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు – మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

📅 05 Dec 2025 ⏱️ 6:21 PM 📝 HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ నంద్యాల,పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) – బడి వైపు ఒక అడుగు” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ “ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని . విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, పాఠశాల మరియు ఇంటి వద్ద పర్యవేక్షణ అత్యవసరం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, క్రమశిక్షణపై రోజువారీ శ్రద్ధ చూపాలని. ఉపాధ్యాయులు బోధనలో మరింత నాణ్యతను పెంచలన్నారు . ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఉత్సవ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషకరం,” అని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు వేయాలన్నారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయం విద్యార్థుల విజయానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనే రెండు బలమైన స్తంభాలపైనే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని. ఈ పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ విద్యార్థుల పురోగతిని సమీక్షించేందుకు, సమస్యలను చర్చించేందుకు ఒక పవిత్ర వేదిక కావాలన్నారు . ప్రతి విద్యార్థిలోనూ అపారమైన సృజనాత్మకత, ప్రతిభ దాగి ఉంటాయిని. వాటిని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదని . అదే సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాల తర్వాత ఇంట్లో ఎంత సమయం చదువుకు కేటాయిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తున్నాముని. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, మన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో ధీటుగా పోటీపడేలా తీర్చిదిద్దాలన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని . ఇందుకోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని. తల్లిదండ్రులు ఈ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకొని, తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించేలా కృషి చేయాలన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ కమిటీ, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితేనే, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయి అన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపించిన విద్యార్థినీ విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు . అనంతరం పాఠశాల యాజమాన్యం మంత్రి ఫరూక్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఫరూక్ పాఠశాల ఆవరణలోనే విద్యార్థులతో కలిసి కూర్చుని, ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్స్) రుచిని, నాణ్యతను పరిశీలిస్తూ వారితో కలసి భోజనం చేశారు. మంత్రి ఫరూక్ భోజనం చేస్తూ, విద్యార్థులతో వారి చదువు, క్రీడలు, పాఠశాల సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత మరియు పరిశుభ్రత ప్రమాణాలను మంత్రివర్యులు స్వయంగా పర్యవేక్షించారు. విద్యార్థుల సంక్షేమం, వారికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉర్దూ డిఐ అస్ముద్దీన్ , ఎంపీడీవో సుగుణ శ్రీ , నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , భూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , బాల ముని మరియు ఎస్ఎంసి చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు, మరియు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Scroll to Top