PS Telugu News
Epaper

తోటి గ్రామస్థుడికి ఆర్థిక చేయూత

📅 08 Oct 2025 ⏱️ 3:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 8 అల్లూరి సీతరామరాజు జిల్లా

చింతూరు మండలం ముకునూరు గ్రామానికి చెందిన బీరబోయిన మురళి మోహన్ ముకునూరు గ్రామం , ఆదివాసి సంక్షేమ పరిషత్ సీనియర్ నాయకులు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న తోటి స్నేహితులు హుటాహుటిన స్పందించి రూ.12,000/- సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆయనని పరామర్శించడానికి వెళ్ళి, నేరుగా ఆయన మరియు వాళ్ళ అమ్మ గారి చేతికి అందించడం జరిగింది. మన ముకునూరు ఉద్యోగులు, యువత మంచి మనసుతో స్పందించి ఆదుకున్న విషయం మనందరికి విధితమే.మానవసేవే మాధవసేవ అని మరొక్కసారి తెలియజేస్తూ…సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.తెలియజేసారు

Scroll to Top