PS Telugu News
Epaper

దాదాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్,

📅 15 Apr 2026 ⏱️ 6:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

అజాజ్ చౌక్ జాంపేట నందు గల ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు… ఈ సందర్భంగా చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి బలుగు బలహీన వర్గాల మార్గదర్శి భారత రాజ్యాంగ దిక్సూచి అయినటువంటి బాబాసాహెబ్ ని నేటి యువత మరువకుండా ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని సమ సమాజ నిర్మాణానికి పాటుపడాలని కుల వివక్షతను వీడనాడాలని అభివృద్ధి మన అందరి బాటగా ముందుకు వెళ్లాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ ఆర్ టి ఎన్.మండవెల్లి వెంకన్న బాబు ,క్లబ్ ట్రెజరర్ ఆర్ టి ఎన్.షేక్ దావూద్ ఇబ్రహీం, జాయింట్ సెక్రెటరీ ఆరు టి ఎన్.నవీన్ ప్రసాద్ సామ్రాజ్య, ఈ డి ఆర్ టి ఎన్.గ్రంధి రాజా, యువరాజ్ ఫైనాన్స్ డైరెక్టర్ జల్దు బాబి, ఈడుపుగంటి రామకృష్ణ చౌదరి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొండబాబు మరియు యువజన సంఘ సభ్యులు పాల్గొని కేక్ కటింగ్ చేసి విచ్చేసిన అందరికీ పంచినారు..
ఈ సందర్భంగా రోటరీ ఐకాన్స్ సుమారు 400 మందికి విందు ఏర్పాటు చేసినారు

Scroll to Top