దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా టి యు సి ఐ నాయకులు జి.అరవింద్ డిమాండ్ చేశారు,
వేల్పూర్ మండల గ్రామాల్లో దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ యజమాన్యం,, బీడీ కార్మికల నిలువు దోపిడీ చేస్తున్న దానికి సంబంధించిన పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి. అరవింద్ మాట్లాడుతూ,,కొన్ని సంవత్సరాల నుండి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమాన్యం ,,బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు అగ్రిమెంట్ ప్రకారంగా 261,97 పైసలు ఇవ్వాల్సింది పోయి వెయ్యి బీడీలకు ₹10 తక్కువ చెల్లిస్తూ కార్మికులకు నిలువు దోపిడీ చేయడం సరైనది కాదని ,,గత మూడు నెలల నుండి దేశాయి బీడీ కంపెనీ యజమాన్యానికి తెలియజేసిన చెవిటోడి ముందు శంఖం ఊదే విధంగా వ్యవరించడం సరైనది కాదని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, పది రూపాయలు తక్కువ ఇవ్వడాన్ని వెంటనే ఆపాలని అట్లాగే,,ప్రభుత్వానికి టెక్స్ ఎగ్గొట్టే విధంగా బీడీ కార్మికులకు బలవంతంగా తినుబండారాలు చిప్స్ ప్యాకెట్స్ కురుకురు ప్యాకెట్స్ ఇవ్వడం వెంటనే ఆపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, లేనియెడల పెద్ద ఎత్తున బీడీ కార్మికులను ఏకం చేసి ఆందోళన చేస్తామని,, దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ యజమాన్యానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం,,ఈ కార్యక్రమంలో, వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల కార్మికులు, పాల్గొన్నారు