PS Telugu News
Epaper

నూతన గుడి నిర్మాణానికి విరాళం

📅 10 Feb 2026 ⏱️ 7:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం నుండి గుడికి ₹40,000 విరాళం

( లోకల్ గైడ్ షాద్ నగర్)

గ్రామ అభివృద్ధితో పాటు ధార్మిక కార్యక్రమాలకు తమ సహకారాన్ని చాటుకుంటూ వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారు గుడి అభివృద్ధికి ₹40,000 (నలభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.గుడి అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘంగా ముందుకు వచ్చి ధార్మిక సేవలకు తోడ్పాటు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ “సంఘంగా ఐక్యంగా గుడి అభివృద్ధికి సహకరించడం ఆదర్శనీయం. గౌడ సంఘం సేవాభావం ప్రశంసనీయం” అని అన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతమంది సంఘాలు చేయాలని, వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారి సహకారం గుడి అభివృద్ధికి శాశ్వతంగా నిలుస్తుందని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు.చివరగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top