నూర్ బాషా జిల్లా ప్రధాన కార్యదర్శి గా అహ్మద్
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
తెలంగాణ ముస్లిం నూర్బాషా / దూదేకుల (వృత్తి) సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కమ్మర్ పల్లి మండలం, ఉప్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ నియమితులైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ జైనోద్ధిన్, జిల్లా అధ్యక్షుడు షేక్ సాదుల్ల తెలిపారు.కమ్మర్ పల్లి మండల కేంద్రం లోని ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసారు ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం అధికారిక ఉత్తర్వులను శనివారం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ అహ్మద్ గత కొంత కాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.ఆయన సేవలను గుర్తించిన సంఘం రాష్ట్ర నాయకత్వం,జిల్లా స్థాయిలో సంస్థను బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించిందన్నారు.నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూర్బాషా/దూదేకుల కమ్యూనిటీ సభ్యులను ఏకం చేయడం,ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం,
రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు జిల్లాలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతమన్నారు.ఈ నియామక పత్రంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దా సాహెబ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు షేక్ షాదుల్లా సంతకాలు చేశారు.అహ్మద్ నియామకం పట్ల పలువురు కమ్యూనిటీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో జిల్లాలో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ,తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ సాజీత్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ షాహిద్,కోశాధికారి మహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.