PS Telugu News
Epaper

న్యూ ఇయర్ సందర్భంగా పేదల కు రగ్గులు పంపిణీ

📅 31 Dec 2025 ⏱️ 7:19 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మానవసేవయే మాధవసేవా

సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి : మండలం సులానగర్ పంచాయతీ లో 30 కుటుంబాలకు బల్లెం చిట్టి బాబు ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సులానగర్ సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్, పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బల్లెం చిట్టిబాబు మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరాలుగా సేవా దృక్పథంతో అనేక ప్రాంతాలలో, పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణం, నీటి సౌకర్యం, మినీ స్కూళ్ల నిర్మాణం, గుత్తి కోయ్యలకు సోలార్ లైట్లు పంపిణీ, ఏదో ఒక రూపంలో సమాజ సేవ చేస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంత మేరకు సాయం అందించాలని వారన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ . మానవసేవయే మాధవసేవ అని నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సులానగర్ సర్పంచ్ గుగులోతు లక్ష్మా నాయక్, మాజీ ఉపసర్పంచ్ ఉండేది బసవయ్య, ఉండేటి ఇర్మియ, కుమ్మరి చౌదరి, తోడేటి తోడేటి యాకోబ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top