PS Telugu News
Epaper

పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు

📅 29 Oct 2025 ⏱️ 3:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

టీకాలు వేస్తున్న వెటర్నరీ ఆఫీసర్ శిల్ప”

(పయనించే సూర్యుడు అక్టోబర్ 29 రాజేష్)

ఈరోజు దౌల్తాబాద్ మండలం పరిధిలో గొడుగుపల్లి గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివావరణ టీకాలు వేయించడం జరిగింది. ఇటీవల గ్రామంలో రైతులు తమ పశువులకు వ్యాధి నిరోధక శక్తిని తట్టుకొని ఉండటానికి పశువుల కోసం ప్రభుత్వ సంక్షేమ కోసం పశువుల డాక్టర్ వెటర్నరీ ఆఫీసర్ శిల్ప ఆధ్వర్యంలో ఈరోజు గొడుగుపల్లిలో టీకాలు వేయడం జరిగింది. రైతులు తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి. గ్రామ మాజీ సర్పంచ్ శివకుమార్. ఉపసర్పంచ్ బాబు. యూత్ కాంగ్రెస్ నాయకులు. బాల శేఖర్ రెడ్డి. దుర్గని నరసింహులు. నరేష్ Abhu తదితరులు రైతులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top