PS Telugu News
Epaper

పోలీస్ అమరవీరుల వారోత్సవ సందర్భంగా డ్రగ్స్ నివారణకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు

📅 25 Oct 2025 ⏱️ 6:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు : పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థులతో పోలీసులు కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదగా విద్యార్థులు యువత డ్రగ్స్ సేవించడం విక్రయించటం చట్టరీత్యా నేరమని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీలో ఇల్లందు డిఎస్పి. చంద్రభాను సీఐ తాటిపాముల సురేష్ ఎస్సైలు సూర్యం హసీనా విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ నివారణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు యువత విద్యార్థులు డ్రగ్స్ పై చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించాలని డ్రగ్స్ రహిత నవ సమాజం కోసం యువత కృషి చేయాలని కోరారు

Scroll to Top