PS Telugu News
Epaper

బిజినపల్లి మండలం లో మహిళా ఓటర్ల సంఖ్య అధికం

📅 15 Sep 2025 ⏱️ 3:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్

బిజినపల్లి మండలం లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. బిజినపల్లి మండలంలో మొత్తం 61 వేల 735 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా ఓటర్లు తుది జాబితా వెల్లడించింది. ఇందులో 30,695 మంది పురుషులు ఓటర్లు గాక, 31,040 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో బిజినపల్లి మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరంతా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Scroll to Top