భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ..

August 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.20.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్..ఈరోజు గురువారం రోజున కమ్మర్ పల్లి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాల వేశారు.*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సంస్కరణలు భారతదేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని అన్నారు.
*కంప్యూటర్ల వినియోగాన్ని ప్రభుత్వ, బ్యాంకింగ్, పరిశ్రమ రంగాల్లో ప్రోత్సహించారు.టెలికమ్యూనికేషన్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.భారతదేశంలో IT రంగానికి పునాది వేసిన నాయకుల్లో రాజీవ్ గాంధీని ప్రముఖంగా ఉన్నారని
టెలికాం విప్లవానికి పునాదిదేశవ్యాప్తంగా టెలిఫోన్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారనిC-DOT వంటి సంస్థల ద్వారా స్వదేశీ టెలికాం సాంకేతికత అభివృద్ధికి ప్రోత్సాహం లభించిందన్నారు..*విద్యారంగ సంస్కరణలు1986లో జాతీయ విద్యా విధానం (National Policy on Education) తీసుకువచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు రాజీవ్ గాంధీ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. *పంచాయతీరాజ్‌ బలోపేతం గ్రామస్థాయిలో ప్రజలకు మరింత రాజకీయ భాగస్వామ్యం కల్పించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే ప్రయత్నాలు చేశారని.ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన 64వ, 65వ రాజ్యాంగ సవరణ బిల్లులు ఆ సమయంలో ఆమోదం పొందకపోయినా, తరువాత 73వ, 74వ రాజ్యాంగ సవరణలకు మార్గం సుగమం చేశాయని తెలిపారు.*ఓటు హక్కు వయస్సు తగ్గింపు61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.దీంతో యువతకు ప్రజాస్వామ్య ప్రక్రియలో పెద్ద స్థాయిలో భాగస్వామ్యం లభించింది అని తెలిపారు.*ఆర్థిక రంగంలో సరళీకరణపరిశ్రమలపై ఉన్న కొన్ని ప్రభుత్వ నియంత్రణలను సడలించే చర్యలు ప్రారంభించిఆధునిక సాంకేతికత, ఉత్పాదకత, ప్రైవేట్ రంగం అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు
*రాజీవ్ గాంధీ పాలనలో కంప్యూటర్లు, టెలికాం, విద్య, యువత భాగస్వామ్యం, పంచాయతీరాజ్ మరియు ఆర్థిక సరళీకరణకు సంబంధించిన చర్యలు భారతదేశ ఆధునికీకరణకు ముఖ్యమైన పునాదులుగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper