PS Telugu News
Epaper

భీమ్‌గల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

📅 03 Jan 2026 ⏱️ 5:47 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఎన్ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు రహిమాన్, సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజంలో అణచివేతకు గురవుతున్న మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ఆ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా భావించే పరిస్థితుల్లో, ఎన్నో అవమానాలను భరించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ, బాల్య వివాహాల నిర్మూలనకు, వితంతు పునర్వివాహాలకు ఆమె అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఎన్ ఎస్ యు ఐ ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉండాలని కృషి చేస్తుందని స్పష్టం చేశారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, మహిళా సాధికారత కోసం పాత్ర ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆమె మార్గంలో నడవడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్, నందు, కృష్ణ, తరుణ్, ప్రవీణ్, సర్జన.క్రాంతి భాను నందు కృష్ణ, విగ్నేష్ గౌరవం సన్నీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top