PS Telugu News
Epaper

మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన

📅 17 Oct 2025 ⏱️ 3:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

(పయనించే సూర్యుడు అక్టోబర్ 17 రాజేష్)

ఈరోజు రాయపోల్ మండలం కేంద్రంలో నిరసన తెలుపుతూ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాయపోల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్ష పడేలా చెయ్యాలి అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ MRPS. VHPS అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని దళితుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని తెలియజేస్తూ… ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర నర్సింలు VHPS జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య మండల అధికార ప్రతినిధి తుడం ప్రశాంత్ కోశాధికారి కొన్నింటి లక్ష్మణ్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top