PS Telugu News
Epaper

యడ్లపాడు మండల వైసీపీ నాయకుల మద్దతు..

📅 13 Sep 2025 ⏱️ 3:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి…

“అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం” ఎరువుల బ్లాక్ మార్కెట్ పై పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని ఆధ్వర్యంలో “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ –
నేడు రాష్ట్రంలోని రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతను అదుపులోకి తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు…అదే విధంగా యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పంట అవసరాలు సమయానికి అందించబడ్డాయని గుర్తుచేశారు…అంతేకాకుండా పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతు కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, మద్దూరి విజయ బాల చంద్రారెడ్డి,రాచమంటి చింతరావు, కర్నాటి సుబ్బారావు, సీను, పందుల బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top