PS Telugu News
Epaper

యాడికి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం.

📅 20 Sep 2025 ⏱️ 5:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

మండల కేంద్రమైన యాడికిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణము నందు టి.డి.పి.నాయకులతో కలిసి మండల అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్ ప్రతాప్ రెడ్డి, ఈఓఆర్డి శశికళ, జడ్పీ హైస్కూల్ హెచ్ సీతారాం, టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, తిరంపురం నీలకంఠ, విజన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్, గూండా నారాయణస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top